ఆత్మనిర్భర్ భారత్ లో 100 యుద్ధ విమానాల నిర్మాణం 

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశంలోనే మొదటిసారిగా సుమారు 100 యుద్ధ విమానాల నిర్మాణాణంకు భారత నావికాదళం సన్నాహాలు చేస్తున్నది.  రక్షణ పరికరాలలో `భారత్ లో తయారీ’ని ప్రోత్సహించడం కోసం అందుకోసం పలు విదేశీ యుద్ధ విమానాల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
మొదటిసారిగా ప్రాజెక్ట్ ఖర్చు కోసం దాదాపు 70 శాతం మొత్తాన్ని భారతీయ కరెన్సీలోనే  చెల్లింపులు చేయడానికి ఉపయోగించనున్నట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. దేశంలో 96 విమానాలను నిర్మించాలనేది ప్రణాళిక. దీని కోసం 36 విమానాలకు చెల్లింపులు పాక్షికంగా భారతీయ, పాక్షికంగా విదేశీ కరెన్సీలో అందిస్తామని చెబుతున్నారు.
కాగా, మిగిలిన 60 విమానాలకు భారత కరెన్సీలో మాత్రమే చెల్లింపులు జరుపుతామని  అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైమానికదళం  114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వైమానిక దళ పోరాట సామర్థ్యాలను పెంపొందించడానికి, దాని అవుట్‌గోయింగ్ ఫ్లీట్ మిగ్ సిరీస్ విమానాలను భర్తీ చేయడానికి మేక్ ఇన్ ఇండియాను ఉపయోగించుకోవాలని ఐఏఎఫ్ ఆలోచిస్తోంది.
 ప్రాజెక్ట్ లోని మొదటి 18 ఎయిర్‌క్రాఫ్ట్ లు పోటీలో ఉన్న విమానాల పరిమిత ట్రయల్స్ ని నిర్వహించిన తర్వాత ఎంపిక చేసిన విదేశీ విక్రేత  హోమ్ బేస్ నుండి దిగుమతి చేసుకుంటారు. మూడేళ్లలో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్ట్ కోసం బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఎంఐజీ, డసాల్ట్, సాబ్ వంటి కంపెనీలు రేసులో ఉన్నాయి.
ఇదిలా ఉండగా,  ఐఏఎఫ్ మొదటిసారి 2007లో విదేశీ ఓఈఎంల నుండి 126 కొత్త కంబాట్ జెట్‌లను కొనుగోలు చేయడానికి మీడియం మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఎంఆర్ సిఎ) టెండర్‌ను ప్రారంభించింది. సామర్థ్యాలపై నిర్మాణాన్ని కొనసాగించాలని, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ గా మంజూరైన పోరాట జెట్‌లను కొనసాగించాలని ప్రతిపాదనలున్నాయి. ”
తేజస్,   ఐఏఎఫ్    ఓల్డ్ మోడల్ విమానాల కోసం ప్రణాళికాబద్ధమైన స్వదేశీ ప్రత్యామ్నాయం, యుద్ధ విమానాల సంఖ్యని పెంచుకోవడానికి మరింత సమయం కావాల్సి ఉంటుంది. ఈ టెండర్ల ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తడంతో 2015లో ఎమ్మార్సీఏ ప్రాజెక్టును రద్దు చేశారు. IAF దానిసామర్థ్యాలను పెంచడంలో భాంగంగా కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ జెట్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.