ప్రయాణికుల కోసం టిటిడి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టిఎస్ ఆర్టీసి ప్రయాణికుల సౌకర్యార్థం స్వామి వారి టిక్కెట్లను మంజూరు చేయడం హర్షణీయమని, భక్తులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
టిఎస్ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని, కుటుంబ సమేతంగా స్వామిని హాయిగా దర్శించుకోవచ్చని వారు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు రోజువారీగా 1,000 టిక్కెట్లను జారీ చేయనుందని వారు చెప్పారు.
అయితే, ఈ ప్యాకేజీ కింద టిఎస్ ఆర్టీసి బస్సులో ప్రయాణించాలనుకునే వారు రెండు రోజుల ముందు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. తక్షణం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను జారీ చేయడానికి టిటిడి సైతం అనుమతి ఇచ్చిందని వారు పేర్కొన్నారు.
ఈ ప్యాకేజీ వల్ల టిఎస్ ఆర్టీసికి మరింత ఆదరణ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీని వినియోగించు కోవాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా సర్టిఫికేట్ లేదా దర్శనానికి 72 గంటలలోపు పొందిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా సమర్పించాలని వారు స్పష్టం చేశారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం