వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2023 కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫార్సులకు దాఖలు చేసేందుకు గడువు 2022 సెప్టెంబరు 15తో పూర్తవుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ 2022 మే 1 నుంచి ప్రారంభమైంది.
వీటిని కేవలం ఆన్లైన్లో స్వీకరిస్తుంది. అవార్డ్స్.జిఒవి.ఇన్ జాతీయ అవార్డుల పోర్టల్లో స్వీకరిస్తారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి పద్మ అవార్డులు ఇస్తారు. 1954 నుంచి ఈ అవార్డులను ప్రతి ఏడాదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.
ఈ అవార్డు ‘విశిష్ట పని’ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సోషల్ వర్క్, సైన్సు, ఇంజి నీరింగు, పబ్లిక్ అఫైర్స్, సివిల్, సేవ, వాణిజ్యం, పరిశ్రమ వంటి అన్ని రంగాలూ, విభాగాల్లోనూ విశిష్టమైన, అసాధారణమైన విజయాలు, సేవలకు అందిస్తారు.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్