ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు మన దేశం మరోసారి సాయం చేసింది. అక్కడ ఆయిల్ కొరత ఎక్కువగా ఉండడంతో క్రెడిట్ లైన్ ఫెసిలిటీ కింద మరో 40 వేల టన్నుల డీజిల్ పంపించింది. అది కొలంబోకు చేరిందని అక్కడి ఇండియన్ హైకమిషన్ శనివారం ట్వీట్ చేసింది.
శ్రీలంకకు సాయం చేసేందుకు క్రెడిట్ లైన్ ను మరో 500 మిలియన్ డాలర్లకు పొడిగిస్తున్నట్లు పోయిన నెలలోనే మన దేశం ప్రకటించింది. కాగా, ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు మన దేశం, జపాన్ ముందుకొచ్చాయి. కేంద్ర అనుమతితో తమిళనాడు ప్రభుత్వం అక్కడికి రూ.45 కోట్ల విలువైన సరుకులను పంపింది. 9 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాల పొడి, 24 టన్నుల మందులతో బుధవారం చెన్నై నుంచి షిప్ బయలుదేరింది.
ఈ షిప్ ఆదివారం కొలంబోకు చేరుకుంటుందని ఇండియన్ హైకమిషన్ ట్వీట్ చేసింది. లంకకు 1.5 మిలియన్ డాలర్ల సాయం చేస్తామని జపాన్ ప్రకటించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్ పీ) కింద నిత్యావసరాలు అందజేస్తామని తెలిపింది.
దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేత
కాగా, శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేశారు. శాంతి భద్రతల పరిస్థితులు మెరుగుపడడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ఆఫీస్ ప్రకటించింది. ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ ప్రజలు ఆందోళనలు చేయడంతో ఈ నెల 6న అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు.
దేశంలో ద్రవ్యోల్బణం రేటు 40శాతంగా వుంది. ఆహారం, ఔషధాలు, ఇంధనానికి తీవ్ర కొరతగా వుంది. విద్యుత్ కోతలతో పరిస్థితులు దుర్భరంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 9మంది మరణించగా, 200మందికి పైగా గాయపడ్డారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు