కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన హార్దిక్ పటేల్

అసెంబ్లీ ఎన్నికల ముందు గుజరాత్ లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్గత కుమ్ములాటలు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించారు. కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి  ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసినట్లు తెలిపారు. 
 
క్లిష్ట సమయాల్లో దేశంలో అవసరమైనప్పుడు తమ నాయకుడు విదేశాలలోఉంటారని అంటి ఆ లేఖలో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్ ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశం కాంగ్రెస్ నాయకత్వంకు లేదని..ఆ పార్టీ దగ్గర సరైన రోడ్ మ్యాప్ కూడా లేదని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ఓడిపోయిందని అంటూ నిశితంగా విమర్శించారు. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని  సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని తాను  నమ్ముతున్నానని పెక్రోన్నారు.దీన్ని ప్రజలు స్వాగతిస్తారని తాను కచ్చితంగా నమ్ముతున్నానని భారోసా వ్యక్తం చేశారు. తాను భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నానంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
 
పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లోచేరడంతో, ఆయనను గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ కు వచ్చినప్పడు వీరిద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు. 
 
అయితే కొద్ది రోజులుగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరాయని ఇటీవల వరుసగా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు తనను పట్టించుకోవడం లేదని, పార్టీని వీడాలని వేధిస్తున్నారని అన్నారు. అనుకున్నట్టే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందే హార్దిక్ పార్టీని వీడటం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.