.కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ఫామ్హౌస్లో కూర్చొని ప్రణాళికలు రచిస్తున్నారని, రేపే ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ భరోసా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నయా నిజాం కేసీఆర్ను గద్దె దించేందు కు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తన జీవితం లో ఇంతటి పనికిమాలిన, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని చెబుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని ధ్వజమెత్తుతూ టీఆర్ఎస్, మజ్లిస్ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు షాపిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని బెంగాల్లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ మజ్లిస్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఆ పార్టీ అంటే కేసీఆర్కు భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు.
రాష్ట్రంలోని నిరంకుశపాలనను అంతమొందించడం కోసం జరిగిన యాత్ర అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని షా మండిపడ్డారు.
సర్పంచ్కు కూడా అధికారం ఇవ్వకుండా.. కొడుకు, బిడ్డకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్పై అమిత్ షా మండిపడ్డారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అంటూ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని పక్కనపెట్టారని
ఆయుష్మాన్భవ లాంటి వాటిని తెలంగాణలో నడిపించడం లేదన్నారు అమిత్ షా. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించకండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిత్ షా. అధికారమిస్తే ప్రతీ గింజను కొంటామని, సంక్షేమ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు.
త్వరలోనే నిధులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయని అమిత్ షా భరోసా ఇచ్ఛారు. అవకాశం ఇస్తే.. తెలంగాణలో డబుల్ ఇంజన్తో అభివృద్ధి చేసి చూపిస్తాం అని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? అని నిలదీశారు. సచివాలయానికి వెళ్లలేని కేసీఆర్ను ప్రజలే గద్దెదించుతారని షా అమిత్ షా స్పష్టం చేశారు.
More Stories
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే