సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఈ ఘటన చట్టాన్ని లెక్కచేయకపోవడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పరువు హత్య ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు.
మరోవైపు కేసు దర్యాప్తు వివరాలను సమర్పించాలని, మృతుని భార్య రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం ఏమైనా అందించారో చెప్పాలని డీజీపీని ఆదేశించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ కు వెల్లడించాలని చెప్పింది.
మరోవైపు “ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకుణ్ణి కొట్టి చంపారు” అంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ చేసిన ట్వీట్పై జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సాంప్లా స్పందించారు. ట్విట్టర్ వేదికగానే స్పందించిన సాంప్లా, ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాల్సిందిగా తెలంగాణ పోలీసు యంత్రాగాన్ని ఆదేశించారు.
వెనువెంటనే స్పందించిన విజయ్ సాంప్లాకు కృతజ్ఞతలు చెబుతూ తరుణ్ చుగ్ మరో ట్వీట్ చేశారు. మరోవంక, ఆయన నేడు స్వయంగా నాగరాజు కుటుంభ సభ్యులను పర్యటించనున్నారు
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం