
ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడుతూ, “సీఏఏను అమలు చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రమాదం తొలగిన తర్వాత, ఈ చట్టాన్ని అమలు చేస్తాము. మన శరణార్థ సోదరులు, సోదరీమణులకు పౌరసత్వ హక్కులను కల్పిస్తామని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను” అని ప్రకటించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రస్తావిస్తూ, “మమతా దీదీ [బెంగాల్లోకి] చొరబాటు దారులకు అవకాశం కల్పిస్తూ, మన శరణార్థ సోదరులు పౌరసత్వం పొందకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు. అయితే సిఎఎ అనేది వాస్తవమని, అది వాస్తవమని, అది అమలు జరిగి తీరుతుందని గుర్తించాలి. తృణమూల్ కాంగ్రెస్ దీనిని మార్చలేదు” అని స్పష్టం చేశారు.
2019లో అమల్లోకి వచ్చిన
సిఎఎ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ , క్రిస్టియన్ వర్గాల వారికి పౌరసత్వం మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.పశ్చిమ బెంగాల్ రెండు రోజుల పర్యటనలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, ఎన్నికల అనంతర హింస, అవినీతిని అరికట్టడంలో విఫలమైందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా మండిపడ్డారు. యాదృచ్ఛికంగా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
“బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆదేశాన్ని ఇచ్చారు. మమతా బెనర్జీ తన విధానాలను చక్కదిద్దుతారని, ఆమె పనితీరును మార్చుకోవాలని మేము ఆశించాము. ఆమె తనను తాను సరిదిద్దుకోవడానికి మేము ఒక సంవత్సరం పాటు వేచి ఉన్నాము.
కానీ ఆమె మారలేదు, ”అని షా ధ్వజమెత్తారు.ఉత్తర బెంగాల్ కొండల్లోని గూర్ఖా సమాజాన్ని ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. “గూర్ఖా సోదరులు, సోదరీమణులకు వారి ప్రయోజనాల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి అని చెప్పడానికి నేను ఈ రోజు వచ్చాను. రాజ్యాంగ పరిధిలో అన్ని సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటామని హామీ ఇస్తున్నాను” అని తెలిపారు.
2021 ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీ సంఖ్యను 77కి పెంచడంలో సహకరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలకు షా కృతజ్ఞతలు తెలిపారు. “గత అసెంబ్లీ ఎన్నికల్లో [2016] పోటీ చేసినప్పుడు మాకు 3 సీట్లు మాత్రమే వచ్చాయి. మా సంఖ్యను 77 సీట్లకు పెంచుకోవడానికి మీరు మాకు సహాయం చేసారు” అని కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
ఢిల్లీని వణికించిన భూకంపం
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు