కేసీఆర్ ను గద్దె దింపేందుకు నిరంతరం పోరాటం చేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పాల్గొంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తనకు ఫాలోయింగ్ పెరుగుతుందనే తన పేపర్, టీవీలో రాకుండా చేశాడని ఆయన గుర్తు చేశారు. ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీలేదని.. ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని గుర్తు చేశారు. యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కేసీఆర్ పని తీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పారు.
ఈటల రాజేందరన్న న్యూస్ టీవీల్లో, పేపర్లలో వస్తలేదనుకోవద్దని.. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47లా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని మనం అబద్దాలు చెప్పాల్సిన అవసరంలేదని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు.
ఒకప్పటి కాలం వేరిని ..ఇప్పటి జనరేషన్ వేరని అంటూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెబుతూ సీఆర్ ను గద్దె దింపి తీరుతామని ఈటెల స్పష్టం చేశారు.
వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పేదల వైద్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా.. మనం బలీయంగా ఉన్నామని తెలిపారు. కరోనా సమయంలోపేదలకు ఇబ్బంది లేకుండా ప్రధాని మోదీ చూశారని తెలిపారు.
More Stories
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు