యాదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తం గా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా, క్యూలైన్లు చెరువులను తలపించాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణం జరిగి నెలలు గడవక ముందే ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగిపోయింది.
ఆ ప్రాంతం బురదమయం కావడంతో బస్సులు దిగబడి పోయాయి. ఫలితంగా కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చిన భక్తులు కాలి నడకన కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న రింగ్ రోడ్డు చెరువును తలపిస్తోంది. ఇక కొండపైన పరిస్థితి చూస్తే ఈదురుగాలులకు చలువ పందిళ్లు కుప్పకూలాయి. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్