పాత గుంటూరులోని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయ భూముల అన్యాక్రాంతం పట్ల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్వామి వారి కల్యాణోత్సవం కొరకు యెలవర్తి కుటుంబాచార్యులు 1914 లో 2 ఎకరాల ఆస్తి అయివేజు చేస్తూ వినియోగిచాలని ఈ దేవాలయానికి దాఖలు చేశారు.
తరువాత ఈ ఆస్తి దానం భూమి గా గుర్తుంపబడి ఎస్. 43 రిజిస్టర్ లో నమోదు అయింది. ఈ ఆస్తిని 2018-21 వరకు లీజు హోల్డ్ రైట్స్ ద్వారా ఎండోమెంట్స్ వారు వేలం వేసి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ భూమి పాత గుంటూరులో ఉన్నందున, కోట్ల రూ/-ల విలువ చేస్తున్నది.
అందువల్ల భూ మాఫియా కన్ను ఈ భూమిపై పడిందని, ఆ దేవాలయ మాన్యాలు కమిషనర్ వారిని మభ్యపెట్టి, ఈ ఆస్తి, మాన్యాలు దేవాలయానికి సంబంధం లేదని 43 రిజిస్టర్ నుండి డీ లిస్ట్ చేయుటకు కమిషనర్ వారి వద్ద నుండి ఉత్తర్వులు పొందారు. ఈ ఆస్తిని అన్యులకు విక్రయించుటకు, అక్రమ లాభం పొందుటకు ప్రయత్నములు జరుగుతున్నాయని తెలిసి కొంతమంది స్థానిక భక్తులు జూలూరి హేమాంగద గుప్తా హైకోర్టు న్యాయవాది సి.పి సోమయాజిని ఆశ్రయించారు.
ఆయన ఆధ్వర్యంలో ప్రజా వ్యాజ్యం దాఖలు చేయగా హైకోర్టు బుధవారం ఈ కేసు పూర్వపరాలు పరిశీలించి ఆస్థి అందు మూడవ పక్షం వారు ఎటువంటి అన్యాక్రాంతములు జరుపకూడదని హైకోర్టు ధర్మాసనం నుండి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు జడ్జి యం. సత్యనారాయణ మూర్తి స్టే విధిస్తు మధ్యంతర ఉత్తరవులు వెలువర్చారు.
More Stories
మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల