దేశంలో ప్రతి రోజు రూ. 20వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం నాడు నిర్వహించే మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ‘దేశవ్యాప్తంగా ప్రతిరోజు రూ.20 వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్క మార్చి నెలలోనే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా రూ. 10 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయ’ని తెలిపారు.
ఇవి కేవలం సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. చిన్న ఆన్లైన్ చెల్లింపులే పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నో ఫిన్టెక్ స్టార్టప్లు వస్తున్నాయని తెలిపారు.
డిజిటల్ చెల్లింపులు, స్టార్టర్కు సంబంధించిన సొంత అనుభవాలను ఇతరులతోనూ పంచుకోవాలని ప్రధాని సూచించారు. ఇలా పంచుకునే స్వీయ అనుభవాలే దేశంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతో మంది లేఖలు, సందేశాలు పంపిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి సేవలందించిన ప్రధానుల సేవలను స్మరించుకునేందుకు 75వ స్వాతంత్య్ర వేడుకలు మంచి తరుణమని పేర్కొన్నారు.
ఇక క్రీడల్లో మాదిరిగా ఆర్ట్స్, విద్యారంగంతో పాటు ఇతర రంగాల్లో దివ్యాంగులు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. సాంకేతికతను ఉపయోగించుకొని దివ్యాంగులు ఉన్నత శిఖరాలను సాధించగలుగుతున్నారంటూ వారిని కొనియాడరు. ఇక మే నెలలో రంజాన్ రానున్న నేపథ్యంలో ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు