సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీ లో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని, తేదీలపై త్వరలో జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుంది.
ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీశ్ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించినట్లు ఓ నేషనల్ వెబ్సైట్ పేర్కొంది. దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే, అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని ఆ మీడియాతో మనీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్ ఫైల్స్ను ఎక్స్క్లూసివ్గా స్ట్రీమింగ్ చేయబోతున్నాం’ అని ప్రకటించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం రూ 10 కోట్ల బడ్జెట్తో ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
చెప్పాలంటే పాన్ ఇండియా వంటి సినిమాలకు ఈ మూవీ పోటీ ఇచ్చింది. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ది కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే థియేటర్లో కేవలం హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందట. ఇప్పటికే ఓటీటీ రైట్స్ను ప్రముఖ జీ5 సంస్థ సొంతం చేసుకోంది.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు