
పినాక ఎంకె -I (మెరుగైన) రాకెట్ సిస్టమ్ (ఇ పి ఆర్ ఎస్), పినాకా ఏరియా డినియల్ మ్యూనిషన్ (ఎడిఎం) రాకెట్ వ్యవస్థలను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ), భారత సైన్యం పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లలో విజయవంతంగా పరీక్షించాయి. పదిహేను రోజుల వ్యవధిలో మొత్తం 24 ఈపీఆర్ఎస్ రాకెట్లను వివిధ రేంజ్ల్లో ప్రయోగించారు.
రాకెట్లు అన్ని ట్రయల్ లక్ష్యాలను సంతృప్తికరంగా చేరుకోవడం ద్వారా అవసరమైన కచ్చితత్వం, స్థిరత్వం సాధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ట్రయల్స్ తో పరిశ్రమ ద్వారా ఇపిఆర్ఎస్ సాంకేతిక శోషణ ప్రారంభ దశ విజయవంతంగా పూర్తయింది. పరిశ్రమ భాగస్వాములు రాకెట్ సిస్టమ్ యొక్క వినియోగదారు ట్రయల్స్/సిరీస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక.. పినాక రాకెట్ వ్యవస్థను పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. దీనికి పూణేలోని డి ఆర్ డి ఓ మరొక ప్రయోగశాల అయిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ సపోర్ట్ చేస్తోంది. ఇ పి ఆర్ ఎస్ అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా వేరియంట్కి అప్గ్రేడ్ చేసిన వెర్షన్. అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా శ్రేణిని మెరుగుపరిచే అధునాతన సాంకేతికతలతో సిస్టమ్ అప్గ్రేడ్ చేశారు.
పినాకా మెరుగైన శ్రేణి వెర్షన్ పనితీరు సామర్థ్యాన్ని స్థాపించిన తర్వాత, సాంకేతికత పరిశ్రమలకు బదిలీ చేశారు. మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ నాగ్పూర్. డి ఆర్ డి ఓ నుండి ట్రాన్స్ ఫర్ ఆఫ్ టెక్నాలజీ కింద ఎంఐఎల్ తయారు చేసిన రాకెట్లను దీనిలో ఫ్లైట్ టెస్ట్ చేశారు.
పినాకా రాకెట్ వ్యవస్థలో ఉపయోగించగల వివిధ రకాల ఆయుధాలు, ఫ్యూజ్లు కూడా పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి