భారత గగనతలంలో పేలిపోయిన చైనా రాకెట్

మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి కాంతి పుంజం కనిపించడంతో చూసినవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ఉల్కాపాతం అని భావించారు. కానీ ఇది చైనీస్ రాకెట్ చాంగ్ జహేంగ్ 5బి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు పేలిపోవడంతో వెలువడిన కాంతి అని ఓ అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
చాంగ్ జహేంగ్ సిరీస్ రాకెట్‌ను 2021 ఫిబ్రవరిలో ప్రయోగించారు. ఇది శనివారం భూమి వాతావరణంలోకి మళ్ళీ ప్రవేశించింది. భారత దేశ గగనతలంలో పేలిపోయింది. ఈ రాకెట్ శిథిలాల్లో అత్యధిక భాగం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడే మండిపోయాయి. దీనివల్ల హాని జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది.
హార్వర్డ్-స్మిత్‌సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌ ఆస్ట్రోనామర్ జొనాథన్ మెక్‌డొవెల్ అంతకుముందు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రాకెట్ బాడీ శనివారం క్రిందకు వస్తుందని ముందుగానే ఊహించారు. ఈ రాకెట్ రీఎంట్రీ స్టేజ్‌గా తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
చాంగ్ జహేంగ్  రాకెట్ మూడో దశ అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇది మరో గంటలో తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని,  ట్రాక్ కూడా చాలా బాగుందని పేర్కొన్నారు.  లాంగ్ మార్చి 5 ఫ్యామిలీ రాకెట్లను చైనా పంపిస్తోంది. స్పేస్ స్టేషన్‌కు మాడ్యూల్స్‌ను, సిబ్బందిని ఇవి తీసుకెళ్తాయి. చంద్రుడు, అంగారకునిపై పరిశోధనల కోసం వీటిని పంపిస్తోంది.