కోర్టు ధిక్కరణ కేసులో 8మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది.
అయితే హైకోర్టుకు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఐఏఎస్ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు… జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్కు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది.
అలాగే ఒక రోజు కోర్టు ఖర్చులను భరించాలని ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును సీనియర్ ఐఏఎస్లు విజయ్కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ అంగీకరించారు.
ప్రధానంగా గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడాన్ని హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది.
న్యాయస్థానం ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన ధర్మాసనం గురువారం విచారణను ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
More Stories
మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల