వైసీపీని గద్దె దింపేందుకు బిజెపి రోడ్ మ్యాప్

రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు బిజెపి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించాయిరు. బీజేపి జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికలలో  టీడీపీతో పొత్తువుంటుందని బిజెపి  చెప్పలేదని కూడా తేల్చి చెప్పారు. 
 
రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ చేశారు. పైగా వైసీపీ ప్రభుత్వం  నవరత్నాలును కేంద్రం నిధులతో అమలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి పై, నికర జలాల వాటాపై శుక్రవారం కడప జిల్లాలో రాయలసీమ రణభేరి పేరుతో నిర్వహించిన సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 
 
నవరత్నాలను మించినటువంటి ఎక్కువ లబ్ధి, కేంద్ర ప్రభుత్వం పతకాలు వల్ల రాష్ట్ర ప్రజలు పొందుతున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల కంటే ఎక్కువగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందన్నని చెబుతూ కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ వీర్రాజు స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది, దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని ఆయన గుర్తు చేశారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని ధ్వజమెత్తారు. హోదా కన్నా ప్యాకేజి తోనే ఎక్కువ నిధులు సాధించామని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ లో రైల్వేలకి అభివృద్ధికి రూ 65 వేల కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ  65 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేంద్రం లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు అయినా నిర్మించిందా? అని ప్రశ్నించారు. 
 
ఇంకా ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. బిజెపి భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని వీర్రాజు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.