రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా (టారిఫ్, నాన్`టారిఫ్ రాయితీలతో సహా) ప్రవేశపెట్టిన వినూత్న విధానాలతో పాటు జోన్లో సజావుగా నిత్యావసరాల వస్తువుల సరఫరా జరగడానికి కేంద్రీకృత విధానాలను పటిష్టంగా అమలుచేసిన ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా పార్సిల్ ఆదాయాన్ని ఆర్జించింది.
2020-21 సంవత్సరంలో పార్సిల్లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా కరోనా మహమ్మారిచే అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ప్రస్తుత 2021-22 లో (2022 మార్చి 19వ తేదీ వరకు) పార్సిల్స్లో 4.78 లక్షల టన్నుల లోడిరగ్ను నిర్వహించి రూ.200 కోట్ల ఆదాయాన్ని జోన్ సాధించింది.
భారతీయ రైల్వేలు పార్సిల్ స్పేస్ కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం, సమయపాలనతో పార్సిల్ రైళ్లు నడపడం వంటి వినియోగదారుల స్నేహపూర్వక వివిధ విధానాలు ప్రవేశపెట్టింది. డివిజినల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల (బిడియు) బృందాల విశేష కృషితో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
దానితో ఇప్పటికే ఉన్న పార్సిల్స్కు అదనంగా నూతన పార్సిల్స్ను పొందడంతోపాటు రోడ్డు ద్వారా వెళ్లే పార్సిల్స్ను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి తోడ్పడ్డాయి. దీనికి అదనంగా రైల్వేలు ప్రవేశ పెట్టిన వినూత్న విధానాలైన కిసాన్ రైలు వ్యవసాయదారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మంచి మార్కెట్తో మెరుగైన ధర పొందేందుకు దేశ వ్యాప్తంగా నామమాత్రపు కనీస చార్జీతో రవాణా చేసేందుకు రైళ్లు తోడ్పడుతున్నాయి.
దూద్ దురంతో (ప్రత్యేకంగా పాల రవాణా కోసం) నిత్యావసరమైన పాలను దేశ రాజధాని న్యూ ఢల్లీికి రవాణా చేయడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యాపారస్తులు, కార్గో నిర్వాహకులు, రైతులకు ముఖ్యంగా తక్కువ పరిమాణంలో ఉండే వారి ఉత్పత్తులను భద్రంగా, సురక్షితంగా, ఆర్థిక ప్రయోజనంతో, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా రవాణా చేసేందుకు ఈ రైళ్లు అపారంగా తోడ్పడుతున్నాయి.
ఈ అంశాలన్నీ జోన్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేయడానికి తోడ్పడిన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జోన్ లో 473 కిసాన్ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేశారు. వీటి ద్వారా రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందారు.
దూద్ దురంతో ` కరోనాలాక్ డౌన్ సమయంలో దేశ రాజధాని న్యూ ఢల్లీికి పాలను వినూత్న పద్ధతిలో సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.22 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడంతో రూ.34.03 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో ఇది తోడ్పడింది. ఇది కరోనా ముందు సమయంలో జరిగిన పాల సరఫరా కంటే సగటున రెండింతలు ఎక్కువ.
వీటికి అదనంగా, నాన్`లీజ్డ్ ట్రాఫిక్ నుండి రూ.73.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పార్సిల్స్ రవాణాలో సాధారణ ప్రయాణికుల రైళ్లు, సమయపాలనతో పార్సిల్ ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. అంతేకాక, 62 ఎస్ఎల్ఆర్లు, 5 పార్సిల్ వ్యాన్లలో పార్సిల్ స్పేస్ లీజింగ్ ద్వారా రూ.20.08 కోట్ల ఆదాయం సాధించింది.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెరుగైన పార్సిల్ ఆదాయాన్ని సాధించడంలో కృషి చేసిన జోనల్, డివిజినల్ ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల బృందాలను అభినందించారు. ముఖ్యంగా చిన్న తరహా, మధ్య తరహా సరుకులను దేశం నలుమూలలకు రవాణా చేయడంలో ఉత్పత్తిదారులకు సహాయ సహకారాలను అందిస్తూ ఇదే పనితీరును ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన ఈ బృందాలకు సూచించారు.
More Stories
ముగిసిన ఇదో విడత ప్రచారం … రేపే పోలింగ్
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్
మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేసి విచారణ జరిపించండి