ఈ సినిమా చాలా వరకు నిజం .. శశి థరూర్
ఈ చిత్రంలో ఉగ్రవాదంతో బాధపడుతున్న ముస్లింలు, సిక్కుల పోరాటాన్ని నిర్మాతలు విస్మరించారని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) పేర్కొంది. అయితే ఈ చిత్రంలో చూపిన సంఘటనలు చాలావరకు నిజం అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.
“కాశ్మీరీ పండితులు చాలా బాధపడ్డారు. వారి హక్కుల కోసం మనం నిలబడాలి. కాశ్మీరీలకు న్యాయం జరగాలి” శశి థరూర్, ఫేస్బుక్లో బిలాల్ జైదీ పోస్ట్ను పంచుకుంటూ, ఈ పోస్ట్ సరైనదని రాశారు. కాశ్మీరీ పండిట్లు చాలా బాధపడ్డారు. మనం వారి హక్కుల కోసం నిలబడాలి. కశ్మీరీలకు న్యాయం జరగాలి.. అని ఆయన స్పష్టం చేశారు.
“మీరు చేయాల్సిందల్లా వినండి, సహాయం చేయండి .. సరిదిద్దండి” అంటూ పోస్ట్ పెట్టారు. కష్టాల్లో ఉన్న ప్రజల బాధలను మీరు అంగీకరించకపోతే, మీరు ఎటువంటి విభేదాలను పరిష్కరించలేరని కూడా మాజీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారం
కాగా, ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపలేదంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా యధాతథంగా రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. ‘దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి’ అని ట్వీట్ చేశాడు.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం