మణిపూర్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్కే రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఆదివారం ఇంఫాల్ లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ వెనువెంటనే బీరేన్ సింగ్కు బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, బీజేపీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బీరేన్ సింగ్ను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున మణిపూర్లో సుస్థిర, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిగా బీరేన్సింగ్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి.
ఓ ఫుల్బాల్ ఆటగాడు, జర్నలిస్టు అయిన 61 సంవత్సరాల బిరెన్ ఆధ్వర్యంలోనే మణిపూర్లో బిజెపి ప్రచారం సాగింది. బిరెన్ ప్రమాణస్వీకార తేదీ వెలువడాల్సి ఉంది.
More Stories
వయనాడ్ నుంచి ప్రజలు రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్