.చైనాలో సంవత్సరం తర్వాత కరోనా మరణాలు

చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు తెలిపారు. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ విజృంభిస్తోంది. 

శనివారం నాటికి అక్కడ 4,051 కొత్త కేసులు నమోదయ్యాయి. 2021 తర్వాత చైనాలో మళ్లీ కరోనా వైరస్ మరణాలు చోటుచేసుకోవడం ఇప్పుడే. ఈశాన్యంలోని జిలిన్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ చనిపోయారు. ఇదిలావుండగా చైనాలో ‘జీరో కొవిడ్’ విధానానికి స్వస్తి పలకాలని చైనా భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశం ఖండించింది. 

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని నెమ్మదిగా సడలించాలని నిపుణులు సూచించినా సాధ్యం కాదని శుక్రవారం చైనా ప్రభుత్వం తేల్చిచెప్పింది. జీరో కొవిడ్ విధానం వల్ల ప్రజల జీవితం, వృత్తి వంటి అంశాలపై ప్రభావం పడినా వారి ఆరోగ్య, భద్రతను కాపాడటానికి ఆ విధానాన్ని కొనసాగిస్తామని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఉపమంత్రి వాంగ్ హెషెంగ్ తెలిపారు.

ఇదిలావుండగా హాంకాంగ్‌లో కూడా కొత్త కేసులు విజృంభించాయి. రెస్టారెంట్లు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ ఏడాది హాంకాంగ్‌లో కరోనా వల్ల 5,000 మంది మృతి చెందారు. రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. రెస్టారెంట్లు, వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో ఈ విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. జీరో కోవిడ్‌ విధానం వల్ల ప్రజల జీవితం, వఅత్తి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడినా వారి ఆరోగ్యాలను, భద్రతను కాపాడటానికి ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఇక చైనాలో దక్షిణాది టెక్ హబ్ ఉన్న షెన్‌ఝెన్‌లో 1కోటి 75 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఆ నగరాన్ని కూడా మూసేశారు. ‘స్టేఎట్‌హోమ్’ ఉత్తర్వుల కారణంగా లక్షలాది మంది ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌లను కొనసాగించాలని చైనా నిర్ణయించింది. కొవిడ్ పరీక్షలు, క్వారంటైన్‌లు అమలు చేస్తోంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే ఈ విధానానికి కట్టుబడి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఉప మంత్రి వాంగ్‌ హెషెంగ్‌ స్పష్టం చేశారు.