భారత్ నుంచి ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలోకి దూసుకెళ్లడంపై వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్న పాకిస్థాన్ కు క్షీపని ప్రయోగంలోనే చేదు అనుభవం ఎదురైనది. భారత్కు తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించే ఉద్దేశంతో చేపట్టిన క్షిపణి పరీక్ష బెడిసికొట్టింది.
తొలుత ఈ క్షిపణిని గురువారం ఉదయం 11 గంటలకు సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించాలని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ ఎరెక్టార్ లాంచర్ (టీఈఎల్)లో వైఫల్యాన్ని గమనించి ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేశారు.
ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణిని పరీక్షించగా అది కాస్తా విఫలమై కుప్పకూలింది. ఓ గుర్తు తెలియని వస్తువు పొగలు కక్కుతూ ఆకాశం నుంచి నేలపై పడడాన్ని సింధ్ ప్రావిన్స్లోని జంషోరో గ్రామస్థులు గమనించారు.
క్షిపణిని పరీక్షించిన కాసేపటికే అది లక్షిత మార్గం నుంచి పక్కకు జరిగి సింధ్లోని థానా బులా ఖాన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం దాల్చినా కొన్ని స్థానిక మీడియా చానళ్లు మాత్రం ఈ వార్తను ప్రసారం చేశాయి.
భారత బ్రహ్మోస్ మిసైల్ పాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చినందుకు ప్రతీకారంగానే పాక్ ఈ మిసైల్ను ప్రయోగించినట్టు స్థానిక మీడియా తెలిపింది. లక్ష్యాన్ని తాకడంలో అది విఫలమై సమీపంలోనే కుప్పకూలిందని పేర్కొంది.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి