ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు

రూ.2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం 2022-23 వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. త‌మిళ క‌వి తిరువ‌ల్లువార్ సూక్తుల‌తో మంత్రి బుగ్గన బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం:  రూ. 2,08, 261 కోట్లు
మూలధన  వ్యయం:  రూ. 47,996 కోట్లు
రెవెన్యూలోటు: రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు:  రూ. 48,724 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక:  రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ. 3,900 కోట్లు కేటాయింపు

నవరత్నాల సంక్షేమానికి పెద్దపీట
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక: రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ. 3,900 కోట్లు కేటాయింపు

పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖకు: రూ.1,568 కోట్లు
ఉన్నత విద్యకు: రూ.2,014 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతల కేటాయింపులు పెంపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి:  రూ.20,962 కోట్లు
వ్యవసాయ  మార్కెటింగ్‌, సహకార శాఖకు: రూ.11,387 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ 11,482 కోట్లు
గ్రామీణాభివృద్ధికి: రూ.17,109 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు: రూ.13,630 కోట్లు
ఇంధన రంగానికి: రూ.10,281 కోట్లు
జనరల్ ఏకో సర్వీసెస్: రూ.4,420 కోట్లు
ఇండస్ట్రీ అండ్ మినరల్స్: రూ.2,755 కోట్లు
విద్యుత్ – రూ.10,281.04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్ విభాగానికి: రూ.27,706.66 కోట్లు
వ్యవసాయానికి:  రూ.11,387.69 కోట్లు
పశు సంవర్ధక శాఖకు: రూ.1,568.83 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ: రూ.20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ శాఖ: రూ.685.36 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు: రూ.2,014.30 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి: రూ.69,306 కోట్లు

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి: రూ.685 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ కు: రూ.6,145 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కు : రూ.18,518 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ కు: రూ.29,143 కోట్లు
ఎంఎస్ఎంఈలకు: రూ.450 కోట్లు
గ్రామీణాభివృద్ధికి: రూ 17,109 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు: రూ.320కోట్లు
రవాణా రంగానికి: రూ.9,617 కోట్లు
విశాఖపట్టణం – చెన్నై ఇండస్ట్రియల్ కారిార్ కు రూ.236 కోట్లు
ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటివ్ లకు రూ.175 కోట్లు
104 సర్వీసులకు : రూ.140 కోట్లు
108 సర్వీసులకు: రూ.133 కోట్లు
వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాకు : రూ.300 కోట్లు

బడ్జెట్‌ కేటాయింపుల గురించి చెబుతుండగా.. టిడిపి నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ గణాంకాలు కేవలం తప్పుల తడకేనంటూ నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం వారిని వారించేందుకు ప్రయత్నించారు. బడ్జెట్‌ ముగిసిన తర్వాత చర్చించాలని పేర్కొన్నారు. టిడిపి సభ్యులకు ప్రజలపై, బడ్జెట్‌పై నమ్మకం లేదని, వారు అసెంబ్లీ నుండి వెళ్లిపోవాలనుకుంటే… వెళ్లిపోవచ్చునని బుగ్గన అన్నారు. కాగా, సీతారాం వారిని వారించగా.. బడ్జెట్‌ ప్రసంగాన్ని బుగ్గన కొనసాగించారు.