నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీని 2024 సంవత్సరం నాటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
శనివారం అనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ నాసిన్ అకాడమీ నిర్మాణం కోసం మొదటి దశలో రూ 729 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందుకోసం ఇప్పటికే నిధులు కేటాయించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో నాసిన్ అకాడమీని ఏర్పాటు- చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అందులో భాగంగా 2014 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జిల్లాలోని పాల సముద్రం వద్ద నాసిన్ అకాడమీని ఏర్పాటు- చేస్తున్నామని ప్రకటించారని ఆమె గుర్తు చేశారు.
అనంతరం 2015 ఏప్రిల్ నెలలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ- నాసిన్ అకాడమీ ఏర్పాటు-కు శిలాఫలకం ఆవిష్కరణ చేశారని చెప్పారు. ఈ మధ్య కాలంలో అకాడమికి సంబంధించి ఇచ్చిన భూమి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం, పొలాలు ఇచ్చిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించడం జరిగిందని, ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేబడుతున్నామని ఆమె పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారులకు ఉత్తరాఖండ్లోని మస్సురిలో, ఐపిఎస్ అధికారులకు హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఏ విధంగా అయితే శిక్షణ ఇస్తారో అదే విధంగా అనంతపురం జిల్లాలోని పాల సముద్రం వద్ద ఏర్పాటు- చేసిన నాసిన్ అకాడమీలో ప్రొబేషనరి ఐఆర్ఎస్ అధికారులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె వివరించారు.
ఈ అకాడమీలో 2023 సెప్టెంబర్ నుంచి ప్రొబేషనరి ఐఆర్ఎస్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. అనంతరం 2024 నాటికి పూర్తి స్థాయిలో నాసిన్ ఆకాడమీని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఆకాడమికి భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు కేంద్ర మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ అకాడమీని పూర్తి చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అకాడమీ వల్ల హిందూపురం, పాలసముద్రం ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నాసిన్ అకాడమీ ఏర్పాటు-కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని అంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్రికి ఎటు-వంటి లోపం లేకుండా అన్ని రకాల సహకారం అందిస్తామని, నాసిన్ అకాడమీ ఏర్పాటు- ఇందుకు ఒక ఉదాహరణ అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా వారిని ప్రధాని కలుస్తారని ఆమె గుర్తు చేశారు.
ఒక తండ్రి లాంటి అపెక్షన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రధాని పలకరిస్తారని ఆమె చెప్పారు. రాష్ట్రాన్రికి ఎటు-వంటి లోపం లేకుండా అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు.అంతకుముందు కేంద్ర మంత్రి నాసిన్ అకాడమీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు- చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, సిబిఐసి చైర్మన్ వివేక్ జోహ్రీ, సిబిఐసి మెంబర్ సుంగిత శర్మ, నాసిన్ డిజి ఎస్ఆర్. బరూహ్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
కాంగ్రెస్ ను వివాదంలోకి నెట్టిన శ్యామ్ పిట్రోడా