బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతం 

భారత నావికాదళం లాంగ్ రేంజ్ వెర్షన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ క్షిపణి యొక్క దీర్ఘ-శ్రేణి కచ్చితత్వపు టార్గెట్ సామర్థ్యాన్ని టెస్ట్-ఫైరింగ్ ధ్రువీకరించిందని నేవీ ఒక ట్వీట్‌లో పేర్కొంది. రష్యాతో కలసి భారత్ నిర్మించింది.  

అధునాతన వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి యొక్క లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్ధ్యం విజయవంతంగా ధ్రువీకరించారు. లక్ష్యాన్ని పిన్ పాయింట్ లో ధ్వంసం చేయడం ద్వారా పోరాటాన్ని, ఫ్రంట్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మిషన్ సంసిద్ధతను ప్రదర్శించారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం మరో షాట్” అని నేవీ ట్వీట్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్‌ను నావికాదళం క్రమం తప్పకుండా పరీక్షిస్తోంది. భారతదేశం నవంబర్ 2020లో అండమాన్, నికోబార్ దీవుల నుండి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క ల్యాండ్-ఎటాక్ వెర్షన్‌ను పరీక్షించింది. 

ఇదిలా ఉండగా గతేడాది డిసెంబర్‌లో సూపర్‌సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్ 30 ఎంకే-ఐ ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి ఎయిర్ వెర్షన్‌ను పరీక్షించారు. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఈ పరీక్ష జరిగింది. 

దేశంలోనే బ్రహ్మోస్ క్షిపణుల యొక్క ఎయిర్ వెర్షన్ యొక్క సీరియల్ ఉత్పత్తికి వేదికను క్లియర్ చేయడంతో ఫైటర్ జెట్ యొక్క విజయవంతమైన టెస్ట్-ఫైర్ ఒక ప్రధాన మైలురాయి.