
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి దాటింది. దేశవ్యాప్తంగా అర్హతగల 80 శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘సబ్కా ప్రయాస్’ మంత్రంతో, దేశం 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా వేగంగా దూసుకుపోతోందని మాండవియ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ఇవ్వబడిన కరోనా వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య గురువారం నాటికి 174.59 కోట్లు దాటింది.
గురువారం సాయంత్రం 7 గంటల వరకు 33 లక్షలకు పైగా (33,62,813) వ్యాక్సిన్ డోస్లను అందించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్ల సంఖ్య కూడా రెండు కోట్లకు చేరింది.
ఈ సందర్బంగా కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ… టీనేజర్లు ఉత్సాహంగా కరోనా టీకాలు తీసుకుంటున్నారని తెలిపారు. 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి కొవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మూడో వేవ్ నేపథ్యంలో ప్రికాషనరీ డోస్ సైతం వేసింది.
More Stories
మాఘ పూర్ణిమ వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
ఇవిఎంల నుండి డేటాను తొలగించొద్దు.. రీలోడ్ చేయొద్దు
భారత్ పాక్ సరిహద్దుల్లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి