డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. ఈనెల 20వ తేదీన పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మార్చి 11న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రెజ్లర్ ద గ్రేట్ ఖలీ మాట్లాడుతూ బీజేపీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం మోదీ చేస్తున్న పనులు ఆయన్ను ఉత్తమ ప్రధానిగా మార్చిందని పేర్కొన్నారు. దేశ సమగ్రతాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఖలి తెలిపారు.
బీజేపీ జాతీయ విధానం తనను ఆకర్షించిందని చెప్పారు. ఖలీ 2000 సంవత్సరంలో ప్రొఫెషనల్ రెజ్లింగ్ లోకి అడుగుపెట్టడానికి ముందు పంజాబ్ లో పోలీసు అధికారిగా పనిచేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ రంగంలోకి వచ్చాక 2007లో ఏకంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్ సాధించి సత్తా చాటుకున్నారు. అలాగే హాలీవుడ్, ఇటు బాలీవుడ్ సినిమాల్లో, బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కనిపించారు.
కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్, బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఎంపీ సునీతా దుగ్గల్ ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరడం యువతకు స్ఫూర్తిదాయకం అని డా. జితేంద్ర సింగ్ చెప్పారు.
More Stories
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం