తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు.ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు పెట్రోలు బాంబు విసిరి పోలీసులను తప్పించుకుని పారిపోయారు.
‘‘మా బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. 15 సంవత్సరాల క్రితం కూడా డీఎంకే ప్రమేయంతో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వం పాత్రను మేం ఖండిస్తున్నాం… మేం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం.. ఇలాంటి వాటికి బీజేపీ క్యాడర్ భయపడవద్దు.’’ అని బీజేపీ నాయకుడు కరాటే త్యాగరాజన్ చెప్పారు.
“శబ్ధం విన్నప్పుడు నేను నిద్రపోయాను. బయటకు వచ్చి చూడగా రెండు పెట్రోల్ బాంబులను వేయడం చూసాను. ఒకటి భవనం పైభాగంకు, మరొకటి కింది భాగానికి. వారు తమ వాహనాలను అక్కడనే ఆపారు. బాంబులు వేసి వారు పారిపోయారు. నేను వెంటనే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించాను. వారు వచ్చి అదనపు బలగాలను రప్పించారు” అని ప్రత్యక్ష సాక్షి నామ్ ముత్తు కుమార్ తెలిపాడు.
దాడి నేపథ్యంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. నలువైపుల నుంచి బారికేడ్లు వేయడంతో ఆ ప్రాంతం గుండా వాహనాలను అనుమతించడం లేదు.
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్గా గుర్తించిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. బీజేపీ కార్యకర్తలు కార్యాలయం బయట గుమిగూడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్