నిజానికి మహాత్మా గాంధీ సంఘ్ గొప్ప ఆరాధకులలో ఒకరు. 1934లో, గాంధీ మహారాష్ట్రలోని వార్ధాలో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. అన్ని కులాలకు చెందిన యువకులు, బాలురు తోటి స్వయంసేవకుల కులాల వారితో ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉంటూ, కలసి భోజనం చేయడం ఆయనను ఆకట్టుకుంది.
గాంధీ – ఉపాధ్యాయ
1992లో ప్రచురితమైన గాంధీ అండ్ దీనదయాళ్: టూ సీర్స్ అనే వ్యాసంలో, అండర్సన్ గాంధీ, ఉపాధ్యాయ మధ్య పోలికను చూపారు. వారిద్దరి మధ్య చాలా సాధారణ విషయాలను కనుగొన్నారు.“గాంధీ, ఉపాధ్యాయ ప్రాథమికంగా సంఘటనకర్తలు. ద్వితీయంగా వారు తాత్విక ఆలోచనలపై ఆసక్తి కలిగి ఉన్నారు… ఇద్దరూ ఆకర్షణీయమైన వ్యక్తులు,” అని అండర్సన్ రాశాడు. “గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ను మార్చారు… ‘మహాత్మా’గా ఆయన ఆకర్షణీయమైన విజ్ఞప్తి కాంగ్రెస్ను స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర వహించేటట్లు చేసింది… ఉపాధ్యాయ కూడా సాధువు తరహా పాత్ర కలిగి ఉన్నాడు… జనసంఘ్ కేడర్పై కూడాఆయన అదే ప్రభావాన్ని కలిగించారు. ”గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ అధికారంలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారు. పదునైన ఆలోచనలు గలవారే కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన మేధావులు. వారి సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్లు వారి క్షేత్రస్థాయి అనుభవాల నుండి ఉద్భవించాయి.”వాస్తవానికి (గాంధీ, ఉపాధ్యాయ) ఈ పదం యొక్క సాంప్రదాయిక అర్థంలో మేధావులు కాదు. అది విద్యాపరమైన అర్హతలు, వారి వ్రాసిన పుస్తకాల సుదీర్ఘ జాబితాలతో కూడిన వివేకవంతులు. అధునాతన పురుషులు” అని అండర్సన్ రాశాడు.
అంతులేని పోలికల జాబితా
పోలిక ఇక్కడితో ముగియదు. గాంధీ ‘స్వరాజ్’, ‘స్వదేశీ’లకు అత్యంత మద్దతుదారుడు. ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం’ గురించి మాట్లాడేటప్పుడు అటువంటి తత్వాలనే ప్రస్తావించా
“చివరిగా ఇద్దరూ రాజకీయ అధికారం ప్రజారంగంలోని వ్యక్తులపై అవినీతి ప్రభావాన్ని చూపుతుందని అనుమానించారు. వారిద్దరూ ఏ రాజకీయ పదవిని నిర్వహించలేదు. అలా చేయాలని కోరుకోలేదు” అని అండర్సన్ రాశాడు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే గాంధీ తన సన్నిహిత సహోద్యోగులతో మాట్లాడుతూ, “అధికారాన్ని వదులుకోవడం ద్వారా, ఓటర్ల స్వచ్ఛమైన, నిస్వార్థ సేవకు మనల్ని మనం అంకితం చేసుకోవడం ద్వారా, మనం వారికి మార్గనిర్దేశం చేయవచ్చు, ప్రభావితం చేయవచ్చు” అని చెప్పారని అండర్సన్ తెలిపారు.
“ప్రభుత్వంలోకి వెళ్లడం ద్వారా మనకు లభించే దానికంటే ఇది చాలా ఎక్కువ నిజమైన శక్తిని ఇస్తుంది…నేడు రాజకీయాలు అవినీతిమయంగా మారాయి. అందులోకి వెళితే ఎవరైనా కలుషితమే. మనం దాని నుండి పూర్తిగా దూరంగా ఉందాం. తద్వారా మన ప్రభావం పెరుగుతుంది” (డి జి . టెండూల్కర్, మహాత్మా, సంపుటి 8, పేజీలు 278-280) అని గాంధీ పేర్కొన్నారు.
అండర్సన్ ఇంకా ఇలా అన్నాడు, “ఆయన సలహాను ఆయన కాంగ్రెస్ సహచరులు చాలా మంది తిరస్కరించారు. హాస్యాస్పదంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడైన ఉపాధ్యాయ, బహుశా రాజకీయాల పట్ల గాంధీజీ అభిప్రాయానికి మద్దతు పలిదారు”
ఉపాధ్యాయ ఇలా వ్రాశారు, “నేడు రాజకీయాలు ఒక సాధనంగా నిలిచిపోయాయి. అది అంతంతమాత్రంగానే మారింది. కొన్ని సామాజిక, జాతీయ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో రాజకీయ అధికారమే లక్ష్యంగా కాకుండా అధికార రాజకీయాలలో నిమగ్నమైన వ్యక్తులు నేడు మనకు ఉన్నారు (పొలిటికల్ డైరీ, పేజీ-115)…”
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు