అఖిలేశ్ యాదవ్ను మళ్ళి ముఖ్యమంత్రిగా గెలిపించడమంటే రాష్ట్రంలో అంతమైన గూండా రాజ్ను మరోసారి తెచ్చుకోవడమే అవుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఇవాళ యూపీలోని మధురలో పర్యటించిన అమిత్ షా సమాజ్వాదీ పార్టీలో కీలకమైన నేత అజమ్ ఖాన్ అరెస్ట్ అయ్యారని, ఆయనపై అనేక కేసులు ఉన్నాయని, అయినా ఇప్పుడు అఖిలేశ్ శాంతి, భద్రతల గురించి మాట్లాడడం సిగ్గు చేటని చెప్పారు.
యూపీలో ఒకప్పుడు గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్దే రాజ్యం అన్నట్టుగా నడిచేదని, వాళ్లను చూసి పోలీసులు కూడా భయపడేవాళ్లని అమిత్ షా ధ్వజమెత్తారు. మహిళలు, యువతులు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడే రోజులు ఉండేవని, 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనిఆయన గుర్తు చేశారు.
గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్కు పోలీసులంటే దడ పుడుతోందని, వాళ్లే స్వయంగా వచ్చి పోలీసుల వద్ద లొంగిపోతున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లను జైళ్లలో పెట్టామని, యూపీలో కుటుంబ పాలన లేకుండా చేశామని, కులతత్వాన్ని లేకుండా చేసి, అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని, ఇది ప్రజల కళ్లకు కట్టినట్టి కనిపిస్తోందని ఆయన వివరించారు.
20 కోట్ల మంది ప్రజలు ఉన్న యూపీ లేకుండా భారత్ ముందుకు వెళ్లలేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఇన్ని కోట్ల మంది అభివృద్ధికి దూరమైతే దేశం వెనుకబడినట్లేనని తెలిపారు. బీజేపీపై యూపీ ప్రజలు ఉంచిన నమ్మకం, విశ్వాసంతోనే ఈ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్తోందని ఆయన తెలిపారు.
దేశ భవితవ్యాన్ని నిర్ణయించేది యూపీనేనని చెబుతూ ఈ ఎన్నికల్లో కూడా యూపీలో బీజేపీని రెండోసారి గెలిపించి, అభివృద్ధిని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అఖిలేశ్ను గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి పోయి.. గుండా రాజ్ వస్తుందని స్పష్టం చేశారు.
More Stories
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత