మే 5, 2014 నుండి రెండేళ్ల కాలంలో కొట్టాయం జిల్లాలోని తన కాంగ్రెగేషన్ మిషన్ హౌస్లో ములక్కల్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన సన్యాసిని ఫిర్యాదుకు సంబంధించి ములక్కల్ను సెప్టెంబర్, 2018లో అరెస్టు చేశారు.
అయితే, ఈ తీర్పు ప్రాసిక్యూషన్, దర్యాప్తు బృందంతో పాటు ఫిర్యాదు చేసిన నన్ లను షాక్కు గురిచేసింది. దీనిపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేష్ జె బాబు మీడియాతో స్పందిస్తూ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.
దర్యాప్తు అధికారి, కొట్టాయం మాజీ ఎస్పీ ఎస్ హరిశంకర్ విలేకరులతో మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకర తీర్పు అని, దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. తాముఖచ్చితంగా శిక్ష వేస్తారని ఆశించామని, అయితే అప్పీలు చేస్తామని తెలిపారు. “మా వద్ద చాలా దృఢమైన సాక్ష్యాలు ఉన్నాయి. కేసులో సాక్షులందరూ సాధారణ వ్యక్తులు,” అని చెప్పారు.
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుతో సహా ఉన్నత న్యాయస్థానాల వివిధ ఆదేశాలను ఉల్లంఘించిన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. “ఖచ్చితంగా, ఈ తీర్పు భారతీయ న్యాయ వ్యవస్థలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తీర్పుపై కోర్టు \ వివరణలను మేము ధృవీకరిస్తాము. అప్పీల్ దాఖలు చేస్తాము” అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ సందర్భంగా మరో సన్యాసిని కూడా ములక్కల్పై ఇలాంటి ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 2020లో, 35 ఏళ్ల సన్యాసిని 2015లో అప్పటి బిషప్తో చేసిన చాట్లు క్రమంగా లైంగిక స్వభావానికి మారాయని, ఆమె ‘అసహ్యం, విరక్తి, మానసిక వేదన’ కలిగించిందని ఆమె ఆరోపించారు.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, “బిషప్ లైంగిక వ్యాఖ్యలను కొనసాగించాడు. అతని, నా శరీర భాగాల గురించి వివరణతో వీడియో కాల్స్ చేయడం ప్రారంభించాడు. అతను డియోసెస్ బిషప్ అయినందున, నేను ఏమీ చెప్పలేకపోయాను. నేను సెక్స్ చాటింగ్పై ఆసక్తి చూపనప్పటికీ, బిషప్ అసంతృప్తికి భయపడి, చర్చి నుండి బహిష్కరిస్తారనే భయంతో, నేను అభ్యంతరం చెప్పలేదు” అని తెలిపారు.
2017లో తనను శిక్షణకోసం కేరళకు పంపినప్పుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్ అర్థరాత్రి కాన్వెంట్కు వచ్చి తన గదిలోని కుర్చీలో తనను కూర్చోబెట్టారని ఆమె ఆరోపించింది. దాదాపు రెండు గంటల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారని ఆమె తెలిపారు. “నేను గది నుండి బయటకు వెళుతున్నప్పుడు, బిషప్ నన్ను కౌగిలించుకుని, నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. నాకు అసహ్యం కలిగింది. తర్వాత బిషప్ వెళ్ళిపోయాడు,” ఆమె చెప్పింది.
More Stories
దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలపై ఈసీ వేటు
123 ఏళ్ళ తర్వాత అలీఘర్ యూనివర్శిటీ విసిగా మహిళ