తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, బీజేపీ లోక్సభ ఎంపీ మనోజ్ తివారీలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఎంపీ మనోజ్ తివారీ కూడా తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్లో తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి తాను అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. తనకు జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. ఆ ఫలితాలు మంగళవారం వచ్చాయని ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు.
కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.
మరో వైపు కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 37 వేల 379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,830కి చేరింది. కరోనా రోజువారీ పాజిటివీటి రేటు 3.24 శాతంగా నమోదైంది.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది