ఇడిన్బాబా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఉల్లాల్ నియోజకవర్గం నుండి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాష కుమారుడు అనాస్ అబ్దుల్ రహీమాన్ భార్య మరియంను
గత ఆగస్టులో,
ఎన్ఐఏ , రాష్ట్ర పోలీసు విభాగాలతో కలిసి కాశ్మీర్లో మూడు, బెంగళూరు, మంగళూరులో ఒక్కొక్కటి సహా ఐదు ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ & సిరియా ( ఐఎస్ఐఎస్ )కు రిక్రూట్మెంట్ కేసు దర్యాప్తుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసింది.అరెస్టయిన నలుగురిని కశ్మీర్కు చెందిన ఒబైద్ హమీద్, ముజమ్మిల్ హసన్ భట్, మంగళూరుకు చెందిన అమ్మర్ అబ్దుల్ రెహమాన్, బెంగళూరుకు చెందిన శంకర్ వెంకటేష్ పెరుమాళ్ అలియాస్ అలీ ముయావియాగా గుర్తించారు. నిధుల సమీకరణ, రాడికలైజ్ చేయడం, ఐసిస్లో చేరడానికి ఎక్కువ మందిని ప్రేరేపించడం వంటి వాటితో వారికి ప్రమేయం ఉన్నదని ఆరోపించారు.
గతేడాది జరిగిన రైడ్లో ఎన్ఐఏ మరియమ్ను రెండు రోజుల పాటు విచారించినప్పటికీ, వారు ఆమెను అరెస్టు చేయలేదు. అయితే అప్పటి నుంచి ఆమె కదలికలపై ఏజెన్సీ నిఘా పెట్టింది. కొడగు జిల్లాకు చెందిన బంట్ కమ్యూనిటీకి చెందిన దీప్తి మర్ల ఇక్కడి డేర్లకట్టెలోని ఓ కళాశాలలో బీడీఎస్ చదువుతున్న సమయంలో అనాస్తో ప్రేమలో పడింది. తరువాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును మరియమ్గా మార్చుకుంది.
ఆమెకు జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఐసిస్ నెట్వర్క్లోకి యువకులను రిక్రూట్ చేసే రాకెట్లో ఆమె ప్రమేయం ఉందనే అనుమానంతో ఎన్ఐఎ అధికారులు మరియమ్పై విచారణ చేపట్టారని
ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
More Stories
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు
చార్ధామ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి