అఖిలేష్ కు వణుకు పుట్టిస్తున్నాయా?
పెర్ఫ్ఫ్యూమ్ తయారీదారు పుష్పరాజ్ జైన్పై యూపీలో ఐటీ అధికారులు జరిపిన దాడిని సకాలంలో జరిగిన దాడులుగా కేంద్ర నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఆదాయం పన్ను శాఖ ప్రొఫనలిజంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అనుమానాలు వ్యక్తం చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా స్పందించారు.
ఈ దాడులు ఆయనకు వణుకుపుట్టిస్తున్నాయా? భయపడుతున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు పెద్దఎత్తున మేట వేసుకున్నట్టు కనిపించడం చూస్తే ”లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు” ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుందని ఆమె పేర్కొన్నారు.
”ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగి, ముహూర్తం చూసుకుని మరీ దొంగను పట్టుకోవాలంటారా? ఇప్పటికిప్పుడే పట్టుకోవాలంటారా?” అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అది బీజేపీ సొమ్మేమీ కాదని చెప్పారు. ఐటీ చర్యను ‘యాక్షనబుల్ ఇంటెలిజెన్స్’గా ఆమె పేర్కొన్నారు. ఐటీ దాడులు సరైన ప్రదేశంలో, సరైన సమయంలోనే జరిగాయని ఆమె స్పష్టం చేశారు.
More Stories
14 ఉత్పత్తుల పతంజలి లైసెన్స్ రద్దు
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్