వరుస ట్వీట్లలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక వీడియో క్లిప్ను వ్యాప్తి చేయారు. రాష్ట్ర పోలీసులు ముస్లింలపై అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భంలో తాను చేసిన వాఖ్యాలను సందర్భానికి తగిన్నట్లు కాకూండా ఎడిట్ చేసి వ్యాప్తి చేశారని ఒవైసి ఆరోపించారు.
ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్లో యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండరని, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరని ఒవైసీ చెప్పినట్లు వినిపిస్తోంది. “మేము అన్యాయాన్ని మరచిపోము. ఈ అన్యాయాన్ని మేము గుర్తుంచుకుంటాము. అల్లా తన శక్తి ద్వారా నిన్ను నాశనం చేస్తాడు. పరిస్థితులు మారుతాయి. అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు? యోగి తన మఠానికి తిరిగి వస్తాడు. మోదీ పర్వతాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు వస్తారు?” అంటూ ప్రశ్నించారు.
తాను “జాతిహత్య సమావేశం”గా ఆరోపించిన హరిద్వార్లోని ధర్మ సంసద్లో చేసిన ద్వేషపూరిత ప్రసంగాల నుండి దృష్టిని మళ్లించడానికి తన 45 నిమిషాల ప్రసంగంను ఎడిట్ చేసిన ఒక నిమిషం క్లిప్ను వ్యాప్తి చేసారని పేర్కొన్నారు.
“నేను హింసను ప్రేరేపించలేదు, బెదిరింపులు ఇవ్వలేదు. నేను పోలీసుల దౌర్జన్యాల గురించి మాట్లాడాను…. ఈ పోలీసుల దౌర్జన్యాలను గుర్తుంచుకుంటాం అని నేను చెప్పాను. ఇది అభ్యంతరకరమా?” అంటూ ప్రశ్నించారు.ఒవైసీ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడుతూ ఆయనను పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నాతో పోల్చారు. ఎఐఎంఐఎం నాయకులు ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం అలవాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు.
“… జిన్నా ఆత్మ ఒవైసీలో నివసిస్తుంది” అని త్రివేది దయ్యబట్టారు, ప్రత్యక్ష కార్యాచరణ గురించి మాట్లాడుతూ 1946లో, అంటే 1946లో జిన్నా చేసిన వ్యాఖ్యల మాదిరిగానే హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని స్పష్టం చేశారు.
బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, “(మొఘల్ చక్రవర్తి) ఔరంగజేబ్, జిన్నా వంటి ఒవైసీ, సనాతన ధర్మం సహస్రాబ్దాలుగా ఎదుర్కొన్న నాగరికత యుద్ధం ముఖం. ఇప్పుడు బల సమతుల్యత అవసరం” అని పేర్కొన్నారు.
More Stories
యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా కరీనా కపూర్
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు