
చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా బీజింగ్లో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్ను దౌత్యపరంగా అమెరికా, బ్రిటన్ బహిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి. మరొకొన్ని దేశాలు కూడా వీరిని అనుసరించే అవకాశం ఉంది. దౌత్యపరమైన బహిష్కరణ అంటే అమెరికా అధికారులు ఈవెంట్ నుండి దూరంగా ఉంటారు, కానీ క్రీడాకారులు హాజరవుతారు.
శీతాకాల ఒలింపిక్స్ ఫిబ్రవరి 4న ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఇతర దేశాలు సాంప్రదాయకంగా ప్రతి ఒలింపిక్స్కు ఉన్నత స్థాయి ప్రతినిధులను పంపుతాయి. ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఈ సంవత్సరం టోక్యోలో జరిగిన వేసవి ఒలింపిక్స్కు అమెరికన్ బృందానికి నాయకత్వం వహించారు. మరో ప్రముఖులు డౌగ్ ఎంహాఫ్ పారాలింపిక్ క్రీడలకు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.
వైట్హౌస్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు జై బిడెన్ శీతాకాల ఒలింపిక్స్ గురించి దౌత్యపరమైన బహిష్కరణ అవకాశం గురించి పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి. ఒలింపిక్స్ బహిష్కరణ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ వెల్లడించారు. బ్రిటన్ మంత్రులతోపాటు, చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
ఉయ్ఘర్లకు వ్యతిరేకంగా చైనా పేలవమైన మానవహక్కుల రికార్డును, హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలపై అణిచివేతను ఉటంకిస్తూ, శీతాకాల ఒలింపిక్స్ను దౌత్యపరమైన బహిష్కరణ జరపాలని అమెరికాను మానవ హక్కుల సంఘాలు నెలల తరబడి డిమాండ్ చేస్తున్నాయి.
కొన్ని సమూహాలు ఈవెంట్ను “జాతి నిర్మూలన క్రీడలు” అని పిలిచాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని వీటిని వాయిదా వేయాలని లేదా మార్చాలని డిమాండ్ చేశాయి.
ఏప్రిల్లో, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బిడెన్ పరిపాలన శీతాకాల ఒలింపిక్స్లో చైనా మానవ హక్కుల రికార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలిపే మార్గాలను చర్చించడానికి మిత్రదేశాలను చేరుతోందని తెలిపింది. ఈ వారం ప్రారంభంలో, చైనా విధానంపై నిపుణుడు జోష్ రోగిన్ ది వాషింగ్టన్ పోస్ట్లో నవంబర్ చివరిలోపు శీతాకాల ఒలింపిక్స్ను దౌత్యపరమైన బహిష్కరణను బిడెన్ ఆమోదించవచ్చని రాశారు.
బిడెన్ పరిపాలన చైనా సామూహికంగా జైళ్లకు పంపడం, ముస్లిం ఉయ్ఘర్ జనాభాను బలవంతంగా స్టెరిలైజేషన్ చేయడం వంటి మరణహోమములకు వ్యతిరేకంగా తన ముందున్న అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను సమర్ధిస్తున్నది.
“హాంకాంగ్లో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం, టిబెట్లో అణచివేత చర్యలను కూడా విమర్శించింది. జి [చైనీస్ ప్రెసిడెంట్ జి జిన్పింగ్]తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో బిడెన్ మానవ హక్కుల ఉల్లంఘనలను లేవనెత్తారని యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ చెప్పారు” అని ది గార్డియన్ నివేదించింది.
More Stories
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
ఢిల్లీని వణికించిన భూకంపం