కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా? కొనరా ? అని అడిగామని చెబుతూ ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ స్పందించక పోవడంతోనే తాము రైతుల దగ్గరకు వెళ్లామని తెలిపారు. తాము రైతులతో మాట్లాడుతుండగానే రైతులపై టీఆర్ఎస్ నేతలు రాళ్లు, కోడిగుడ్లు వేశారని ఆరోపించారు.
రైతుల చేతిలో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా? అని ప్రశ్నించారు. 70 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. తాము రైతుల దగ్గరకు వెళుతున్నామని తెలిసి కొనుగోళ్లు ప్రారంభించారని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొనుగోళ్లు సరిగా జరిగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తమను వెంటాడుతానంటారా? అని నిలదీశారు. వేటాడటానికి ,రాళ్లతో కొట్టడానికేనా ముఖ్యమంత్రిని చేసిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను వెంటాడే.. వేటాడే ముఖ్యమంత్రి తమకు అవసరం లేదని సంజయ్ స్పష్టం చేశారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేది కేంద్రం లక్ష్యమని పేర్కొంటూ ప్రత్యామ్న్యాయ పంటలు వేయాలని సూచించారు. పంట మార్పిడికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ ను.. ధర్నా చౌక్ లో ధర్నా చేసే స్థితికి తీసుకొచ్చామని ఎద్దేవా చేశారు. వెంటాడుతాం, వేటాడుతాం అంటూ మాట్లాడే సీఎం రాష్ట్రానికి అవసరం లేదని తేల్చి చెప్పారు. అమరుల ఆశయ సాధనకు పోరాడుతున్న తమను వెంటాడుతావా?వేటాడుతావా? అని సంజయ్ ప్రశ్నించారు.
More Stories
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే
ఖమ్మంలో రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు