
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్అ నుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఏడాది దాటిన తర్వాత కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. సాక్ష్యాధారాల సేకరణ కోసం అమెరికా సాయం కోరినట్లు వార్తలు వచ్చాయి.
సుశాంత్ సింగ్ ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాల్లో డిలిటెడ్ (తొలగించిన) డేటా తిరిగి పొందడానికి సాయం చేయాలని అమెరికాను కోరినట్లు తెలియవచ్చింది. డేటా రికవరీ చేయడానికి గూగుల్, ఫేస్బుక్ యాజమాన్యాలకు ఇదే తరహా రిక్వెస్ట్లు పంపినట్లు సమాచారం.
అమెరికా-భారత్ మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద రెండు దేశాలు తమ అంతర్గత కేసుల దర్యాప్తులో పరస్పరం సమాచారం కావాలని కోరవచ్చు. గూగుల్ జీ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాల్లో తొలగించిన డేటా ద్వారా సుశాంత్సింగ్ మరణానికి కారణమేమిటో తెలుసుకోవాలని సీబీఐ ఉవ్విళ్లూరుతున్నది.
తొలుత ఈ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ప్రారంభించారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. ఇప్పటికీ సుశాంత్ సింగ్ మరణానికి కారణం బహిర్గతం కాలేదు. మరోవైపు సుశాంత్ అభిమానులు న్యాయం కావాలని సోషల్ మీడియాలో ఇప్పటికీ కోరుతున్నారు. ఈ కేసుకు దిశా సాలియన్ ఆత్మహత్యకు లింక్ ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
More Stories
పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
10 వేల మార్క్ను దాటిన యాక్టివ్ కరోనా కేసులు
సివిల్స్ నియామక పక్రియ ఆరు నెలలు మించకూడదు