
అమరావతి రాజధాని రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం నినాదంతో చేపట్టదలచిన మహా పాదయాత్రకు ఆంధప్రదేశ్ హైకోర్టు అనుమతినిచ్చింది.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు, కూలీలు సిద్ధమవుతున్నారు.
నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రాజధాని రైతులు పాదయాత్ర చేసేందుకు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున వాటిని ఉద్యమ నిర్వాహకులు అమలు చేయలేరని, మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిథిలో ఉండడంతో దాని మీద ఆందోళనకు అనుమతించడం వీలుకాదని చెబుతూ పొలీసులు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు.పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. దీనితో పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు వెల్లడించారు. అనంతరం షరతులతో పాదయాత్రకు అనుమతినిచ్చింది.
More Stories
మార్గదర్శి కేసులో రామోజీరావుకు ఏపీ సీఐడీ నోటీసులు
టీటీడీకి ఆర్బీఐ రూ. 3 కోట్ల జరిమానా
ఏపీలో 15 ఆశావహ మండలాల ఎంపిక