భారతీయ జనతా పార్టీ రాబోయే దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా కొనసాగుతుందని గోవాలో పర్యటిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. మొదటి 40 ఏండ్లు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా ఉన్నట్లే.. బీజేపీ ఓడిపోయినా, గెలిచినా కూడా రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
ప్రజలు మోదీని ప్రధాని పీఠం నుంచి తోసేసే రోజు కోసం రాహుల్గాంధీ ఎదురుచూస్తున్నారని చురకలంటించారు. మోదీ అధికారంలో ఉన్నంత వరకే బీజేపీ బలంగా ఉంటుందన్న బ్రమల్లో రాహుల్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడింట ఒక వంతు ఓట్లు మాత్రమే బీజేపీ వస్తుంటే.. మిగతా రెండు వంతుల ఓట్లను 10-15 పార్టీలు పొందుతున్నాయని చెబుతూ దీనికి కాంగ్రెస్ బలహీనతే ప్రధాన కారణమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ బలాన్ని అర్థం చేసుకోకపోతే, ఆయనను ఓడించలేరని స్పష్టం చేశారు.
చాలా మంది తమ శక్తిని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించరని చెప్పారు. మోదీ పాపులారిటీకి కారణం ఏంటో అర్థం చేసుకుంటే గానీ, ఆయన్ను ఓడించడానికి కౌంటర్ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలకు సూచించారు. మోదీపై ప్రజలు కోపంతో ఉన్నారని, ఆయన్ను బయటకు పంపిస్తారనే ఉచ్చులో ఎప్పుడూ పడొద్దని ప్రశాంత్ కిషోర్ హితవు చెప్పారు.
బహుశా మోదీని పారద్రోలవచ్చేమో కానీ, బీజేపీ ఎక్కడికీ వెళ్లదని తేల్చి చెప్పారు. రాబోయే కొన్ని దశాబ్దాలు బీజేపీతో పోరాడాల్సి ఉంటుందని, అందుకు మానసికంగా, శారీరకంగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. మోదీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే బీజేపీ బలంగా ఉంటుందన్న భ్రమలో రాహుల్ ఉన్నారని, బహుశా ప్రజలు మోదీని అధికారం నుంచి త్రోసిపుచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాహుల్ భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు