హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని… అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
దళితబంధు ఆపేయించారని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలైన తెల్లారి అందరికీ దళితబంధు ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అంతా భావిస్తున్నారని చెబుతూ ఈటల రాజేందర్. హుజురాబాద్ ఎన్నికతో కేసీఆర్ నిజస్వరూపం బయట పడుతుంది తెలిపారు. .
తెలంగాణ వచ్చాక బాగుపడింది ఒక్క సీఎం కుటుంబసభ్యులేనని మండిపడ్డారు. స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఇప్పుడెక్కడ ఉన్నా యని ప్రశ్నించారు. కేవలం ఈటల మీద గెలిచేందుకే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, అందుకే ఈ పథకానికి ఈటల రాజేందర్ దళితబంధు అని పేరు పెట్టాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలయ్యాక దళితబంధును అమలు చేయరని, దళితబంధు అమలు కావాలంటే ఈటల రాజేందర్ను గెలిపించాలని కిషన్రెడ్డి కోరారు.
ఈటల మాట్లాడుతూ తాను దళితబంధును ఆపేందుకు లేఖ రాశానని కేసీఆర్ తనపై నిందలు వేశారని పేర్కొన్నారు. కేసీఆర్కు సీఎం పదవి వారసత్వంగా వచ్చింది కాదని, ప్రజల ఓట్లతో వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. దళితబంధును తెలంగాణవ్యాప్తంగా అమలు చేయించడమే తన మొదటి యుద్ధమని, ఈ నెల 30 తర్వాత ఇక తనకు అదే పని అన్నారు. ఉపఎన్నికలో, 2023 ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
More Stories
అతి త్వరలో మావోయిస్టుల అంతం
102 లోక్ సభ స్థానాలకు మొదటి దశ పోలింగ్ రేపే
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ