డ్రగ్స్ కేసులో బాలీవుడ్ పరిశ్రమలోని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యువ నటి అనన్య పాండే నివాసంలో గురువారం ఎన్సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణ నిమిత్తం ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఆమె ఫోన్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.
షారుక్ నివాసంలోనూ ఎన్సిబి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం షారుక్ తన కుమారుడు ఆర్యన్కు కలిసేందుకు ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లారు. ఆయన జైలు నుండి తిరిగి వచ్చిన కొద్ది గంటలకే ఎన్సిబి అధికారులు మన్నత్కు చేరుకున్నట్లు సమాచారం.
క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ బెయిల్ విచారణ సందర్భంగా ఎన్సిబి అధికారులు బుధవారం పలు కీలక విషయాలను కోర్టుకు వెల్లడించారు. క్రూయిజ్ నౌకపై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్ డ్రగ్స్ కోసం ఒక కొత్త నటితో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్సిబి పేర్కొంది.
ఆర్యన్ చాట్ చేసింది అనన్యతోనే అన్న పేరు వినిపిస్తోంది. కాగా, ఆర్యన్ఖాన్ బెయిల్ను ముంబయి ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో .. అతని తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు అక్టోబరు 26న విచారణ చేపట్టనుంది.
More Stories
ఐఐటీల్లో 40 శాతం మందికి ఉద్యోగాల్లేవు
సందేశ్ఖాలీ కేసులో సిబిఐ తొలి ఎప్ఐఆర్
ఎన్నికల కమిషన్ ను నియంత్రించలేం