పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లలిత్పూర్ జిల్లా అధ్యక్షులతో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
గత ఐదేళ్లుగా తనపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో సహా 25 మంది అత్యాచారాలకు పాల్పడినట్టు బాలిక చేసిన ఫిర్యాదుతో ఈ అరెస్టులు చేశామని పోలీస్ సూపరింటెండెంట్ నిఖిల్ పాఠక్ తెలిపారు. బాధితురాలి తండ్రి, మేనమామ, ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు సహా అందరిపైనా కొత్వాలి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 12న కేసు నమోదైందని పేర్కొన్నారు.
మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్పై శుక్రవారం దాడులు జరిపి లలిత్పూర్ సమాజ్వాదీ పార్టీ జిల్లా చీఫ్ తిలక్ యాదవ్, బీఎస్పీ జిల్లా చీఫ్ దీపక్ అహిర్వర్, మహేంద్ర డూబే అనే ఒక ఇంజనీర్ను అరెస్టు చేసి స్థానిక కోర్టు ముందు హాజరుపరిచామని నిఖిల్ పాఠక్ తెలిపారు.
వీరిని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించిందని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను ఇంతకుముందే అరెస్టు చేశారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా