అమిత్ షా ఆదివారం ఇచ్చిన ట్వీట్లో, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. అవసరంలో ఉన్న ప్రజలకు సాధ్యమైన అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సాయపడుతుందని తెలిపారు.
సహాయ కార్యక్రమాల్లో సాయపడేందుకు ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు స్పందన దళం) సిబ్బందిని ఇప్పటికే పంపించామని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళ వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. కూట్టిక్కల్, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల నుంచి మరికొన్ని మృతదేహాలు ఆదివారం వెలిగి తీశారు. దీంతో ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21కి చేరింది.
కొట్టాయంలో 13, ఇడుక్కిలో 8 మంది మృతి చెందినట్టు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. భారత వైమానిక, సైనిక, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బలగాలు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానికులు సహాయక చర్చలు ముమ్మరం చేశారు. కొట్టిక్కల్, కొక్కయార్ పంచాయతీల పరిధిలో డజను మందికి పైగా జాడ గల్లంతైనట్టు చెబుతున్నారు.
కాగా, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలరెట్, రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో అతలాకతులమైన ప్రాంతాల్లోని టూరిస్టు కేంద్రాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసివేయాలని, బోటింగ్ సర్వీసును కూడా సస్పెండ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు
More Stories
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు