త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లోని హృషీకేశ్లో ఉన్న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో గురువారం జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన జాతికి అంకితం చేశారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు.
పీఎం కేర్స్ నిధి క్రింద కొత్తగా 4,000 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా ఫ్లాట్ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపించిందని ప్రధాని తెలిపారు.
అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్థ్యాన్ని చాటిందని పేర్కొన్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని, మాస్క్లను దిగుమతి చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అన్ని రంగాల్లో ఎగుమతి చేసే దిశగా భారత్ దూసుకువెళ్లుందని ప్రధాని చెప్పారు.
దేశవ్యాప్తంగా 92 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
More Stories
48 గంటల్లో సిట్ ముందు లొంగిపో.. ప్రజ్వల్కు హితవు
ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!