కాగా, తీన్మార్ మల్లన్నను దేశ ద్రోహి లాగా జైలులో బంధించారని, 37 రోజులుగా మానసికంగా వేధిస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నను చంచల్ గూడ జైలులో కలిసిన అరవింద్ మల్లన్న ఉగ్రవాది కాదని, పోరాట యోధుడని అని స్పష్టం చేశారు. ఒక్కడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభార్థిగా గా అయ్యా, కొడుకులకు చుక్కలు చూపెట్టాడని గుర్తు చేశారు.
కేసీఆర్, కేటీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరిస్తూ “అసలైన దొంగలు మీరు.. మల్లన్న కాదు” అని అరవింద్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మల్లన్నను బంధించారని ఆరోపించారు. మల్లన్నను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని., .త్వరలోనే ఆయన బయటకు వస్తాడని, తాము ఘన స్వాగతం పలుకుతామని అరవింద్ వెల్లడించారు.
కేసీఆర్ గాంధీ కాదు.. బ్రాంది అంటే జైలులో పెడతారా ? కేసీఆర్ గాంధీ నా, బ్రాంది నా?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర కేసుల పేరుతో మల్లన్నను వేదించాలనుకున్నారని, కానీ.. పోరాట యోధుడు ఎవరికీ భయపడడని స్పష్టం చేశారు. అంతేకాదు..ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
More Stories
తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్స్వీ ప్
పోలీసుల తీరుపై మాధవీలత అసహనం
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మోదీ