తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం రూ. 300 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసింది. ఇందులో స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ. 268.39 కోట్లు, ప్రసాద్ కింద రూ.36.73 కోట్ల మేర నిధులను మంజూరు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి వెల్లడించారు.
స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లను వెచ్చించనున్నారు. అలాగే ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్లను ఖర్చు చేయనుంది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తూ కిషన్రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-2016లో రూ.91.62 కోట్లు, ములుగు-…లక్నవరం…-మేడారం..-తాడ్
ప్రసాద్ పథకం కింద ఆలంపూర్లోని జోగులాంబ దేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020- 2021లో రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో తెలిపారు.
More Stories
పట్టభద్రుల ఎంఎల్సికి నోటిఫికేషన్
వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి