“భారతదేశంపై ద్వేషపూరిత ప్రసంగం కోసం ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ ప్రతినిధి బృందం చేసిన మరో ప్రయత్నాన్ని మనం ఈ రోజు చూశాము. ఆ దేశం ఇంట్లో, సరిహద్దులలో ‘హింస సంస్కృతి’ని ప్రేరేపిస్తూనే ఉంది. అటువంటి ప్రయత్నాలన్నింటినీ మేము తోసిపుచ్చుతాము, ఖండిస్తున్నాము,” అని ఆమె తేల్చి చెప్పారు.
అసహనం, హింస అభివ్యక్తి అయిన ఉగ్రవాదం అన్ని మతాలు, సంస్కృతులకు విరుద్ధమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మైత్రా పేర్కొన్నారు. “ఈ చర్యలను సమర్థించడానికి మతాన్ని ఉపయోగించే ఉగ్రవాదులు, ఈ అన్వేషణలో వారికి మద్దతు ఇచ్చేవారి పట్ల ప్రపంచం ఆందోళన చెందాలి” అని ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ చురక అంటించారు.
భారతదేశం మానవత్వం, ప్రజాస్వామ్యం, అహింస సందేశాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేస్తూ, ఐక్యరాజ్యసమితిలో చర్చలు, ముఖ్యంగా మతం అంశంపై సహేతుకత, నిష్పాక్షికత, ఎంపిక కానీ ధోరణి ఆధారంగా జరగాలని భారతదేశం తన పిలుపుని పునరుద్ఘాటిస్తున్నట్లు ఆమె చెప్పారు.
“నాగరికతల ఐక్యరాజ్యసమితి సమ్మేళనం, సభ్య దేశాలతో సహా ఐక్యరాజ్యసమితి శాంతి సంస్కృతికి ఆటంకం కలిగించే అటువంటి సమస్యలపై ఎంపిక విధానంపై దూరంగా ఉండాలి” అని ఆమె చెప్పారు.
కరోనా మహమ్మారి మునుపెన్నడూ లేనివిధంగా మానవజాతి పరస్పర అనుసంధానం, పరస్పర ఆధారితతను స్పష్టం చేస్తున్నప్పటికీ మహమ్మారి సమయంలో కూడా, “మనం అసహనం, హింస, తీవ్రవాదం పెరగడాన్ని చూశాము.” “మహమ్మారి మధ్యలో కూడా, మనం ‘ఇన్ఫోడెమిక్’ సవాలును ఎదుర్కొంటున్నాము, ఇది ద్వేషపూరిత ప్రసంగం పెరగడానికి, సమాజాలలో ద్వేషాన్ని పెంచడానికి కారణమైంది” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం జూన్లో, 12 దేశాలతో పాటుగా భారతదేశం కరోనా సందర్భంలో “ఇన్ఫోడెమిక్” పై క్రాస్-రీజినల్ స్టేట్మెంట్కి సహ-స్పాన్సర్ చేసిందని, ఇది సమితి సభ్య దేశాల మొదటి ప్రకటన అని ఆమె గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, బహుళత్వం, కరుణ, సాంస్కృతిక వైవిధ్యం, సంభాషణ,అవగాహన సూత్రాలు శాంతి సంస్కృతికి ఆధారం అని మైత్రా స్పష్టం చేశారు.
“భారతదేశాన్ని ‘భిన్నత్వంలో ఏకత్వం’ కలిగిన దేశం అని పిలుస్తారు. బహుళత్వం అనే మా భావన ‘సర్వ ధర్మ సంభవం’ అనే మా ప్రాచీన తత్వంపై ఆధారపడి ఉంటుంది. అంటే ‘అన్ని విశ్వాసాలకు సమాన గౌరవం’ అని ఆమె పేర్కొన్నారు. 1893 చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంటులో భారతదేశపు గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద చేసిన ప్రసంగంలో అన్ని మతాల గొప్పతనాన్ని అంగీకరించే భారతదేశ నాగరికత నైతికతను ఆకట్టుకున్నారని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“భారతదేశం కేవలం హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం, సిక్కు మతం.ల జన్మస్థలం మాత్రమే కాదు. ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవ మతం, జొరాస్ట్రియనిజం బోధనలు బలంగా పాతుకుపోయిన భూమి” అని ఆమె తెలిపారు.
శాంతి సంస్కృతి అనేది సమగ్ర, సహనశీల సమాజాలను నిర్మించడానికి ఏ ప్రపంచ క్రమానికి మూలస్తంభం. 1999 లో బంగ్లాదేశ్ ఆదేశాల మేరకు ఐక్యరాజ్యసమితి ప్రకటన, కార్యాచరణ కార్యక్రమాన్ని ఆమోదించినప్పటి నుండి, శాంతి సంస్కృతి అజెండా సంఘీభావం, అవగాహనా పెంపొందింప చేయడానికి బహుళపక్ష చర్యల కోసం సమర్థవంతమైన బ్లూప్రింట్ను అందించిందని ఆమె గుర్తు చేశారు.
More Stories
రెండో దశలో 64.2 శాతం పోలింగ్
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ప్రాణహాని ఉందని జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు