ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల పేరుతో పెద్ద కుంభకోణం నడుస్తున్నదని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రూ.12,450కో ట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించారని, రూ 1340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొంటూ మరి పనులు ఎక్కడ? కాంట్రాక్టర్లు ఏరి? అని ప్రశ్నించారు.
`జనసేన ఫర్ ఏపీ రోడ్స్; పేరుతో రోడ్ల పరిశీలన పోస్టర్ను ఆవిష్కరిస్తూ లక్షా 26వేల కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదని విమర్శించారు. ఏపీ వ్యాప్తంగా 3,600 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారు… మరి ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎందుకు పాదయాత్ర చేయరు? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు.
ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని సిఎం జగన్ ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఇదే రోడ్లపై ప్రయాణిస్తున్నా గోతులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
‘వాహన మిత్ర స్కీం పెట్టి పదివేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని మూడింతలు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. తమ కార్యకర్త ప్లేకార్డు చేతబడితే కేసులు పెట్టారని పేర్కొంటూ రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు.
సెప్టెంబర్ 2, 3, 4తేదీలలో ఈ వీడియోలు ప్రదర్శిస్తామని, ఆ తరువాత ప్రభుత్వం స్పందించాలని నెల రోజుల పాటు వేచి చూస్తామని మనోహర్ చెప్పారు. అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమదానంతో బాగు చేస్తామని వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు వరుసగా ఉంటాయని చెప్పారు. జనసేన ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు