మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రికి చెంప దెబ్బ అని ఆయన అన్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆయన బోంబే హైకోర్టును ఆశ్రయించారు.
జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న నారాయణ్ రాణేను మంగళవారం మధ్యాహ్నం రత్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. రాణే తరపున అడ్వకేట్ అనికేత్ నికమ్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాణేపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరారు. ఆయనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు.
ఉద్ధవ్ ఠాక్రేపై రాయగఢ్ జిల్లాలో సోమవారం ప్రసంగించినప్పుడు కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై చేసిన మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ మూడు ఎఫ్ఐఆర్లు రాయగఢ్, పూణే, నాసిక్ జిల్లాలలో నమోదయ్యాయి. ముందస్తు బెయిలు కోసం నారాయణ్ రాణే చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ్ రాణే జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా సోమవారం రాయ్గఢ్లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రసంగించినపుడు, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైందనే విషయాన్ని మర్చిపోయారని తెలిపారు.
ఎన్ని సంవత్సరాలైందో లెక్కపెట్టాలని తన సహచరులను ఉద్ధవ్ ప్రసంగం మధ్యలో కోరారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ, శివసేన మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. నాసిక్లో శివసేన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్పై రాళ్ల దాడి చేయగా.. ముంబైలో రెండు పార్టీల వాళ్లు బాహాబాహీకి దిగారు. శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. వీథుల్లోకి వచ్చి ధర్నాలు కూడా చేశారు.
రానే తన వ్యాఖ్యలను ఈ రోజు ఉదయం సమర్ధించుకున్నారు. వాటిని చేయడం ద్వారా తాను ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ కేసులో అతడిని అరెస్టు చేస్తారనే ఊహాగానాలపై, రాణే తాను ‘సాధారణ’ వ్యక్తిని కాదని, అలాంటి రిపోర్టేజీకి వ్యతిరేకంగా మీడియాను హెచ్చరించానని చెప్పాడు.
“నేను ఏ నేరం చేయలేదు. మీరు దానిని ధృవీకరించి టీవీలో చూపించాలి, లేదంటే నేను మీపై (మీడియా) కేసు నమోదు చేస్తాను. ఏ నేరం చేయనప్పటికీ, మీడియా నా ‘ఆసన్న’ అరెస్ట్ గురించి ఊహాజనిత వార్తలను చూపుతోంది. నేను ఒక సాధారణ (సాధారణ) మనిషి అని మీరు అనుకుంటున్నారా?” అంటూ హెచ్చరించారు.
పోలీసులకు ఫడ్నవీస్ హితవు
ఇదిలావుండగా, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు. తాను వారిని బెదిరించడం లేదని పేర్కొన్నారు.
ఠాక్రేపై రాణే చేసిన ప్రకటనను వ్యక్తిగతంగా తాను సమర్ధించడం లేదని అయితే పార్టీ ఆయన వెన్నంటి నిలిచిందని స్పష్టం చేశారు. షర్జిల్ ఉస్మానీ భారత మాతను అవమానపరిచినా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, కేంద్ర మంత్రి రాణేపై మాత్రం మహారాష్ట్ర సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని దుయ్యబట్టారు.
మహా సర్కార్ ఖాకీల అండతో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయాలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు. హింసపై తమకు నమ్మకం లేదని చెబుతూ దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు.
అరెస్ట్ ప్రోటోకాల్ కు విరుద్ధం
కేంద్ర మంత్రి రాణేను అరెస్ట్ చేయడం “ప్రోటోకాల్”కు విరుద్ధం అని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ విమర్శించారు. కేంద్ర మంత్రిని సుమోటుపై అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేయగలరని ప్రశ్నించారు.
“జన ఆశీర్వాద్ యాత్రలో రాణే కొంకణ్ ప్రాంతంలో విపరీతమైన మద్దతు పొందుతున్నారనే వాస్తవం నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఈ అరెస్ట్ డ్రామా రూపొందించిది” అని ధ్వజమెత్తారు.
“ప్రోటోకాల్ ప్రకారం, భారత రాష్ట్రపతి ర్యాంక్లో నంబర్ వన్. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత ప్రధాని. ర్యాంకింగ్లో, జూనియర్ క్యాబినెట్ మంత్రి కూడా (ఎ), తరువాత ముఖ్యమంత్రి ఏడు (బి) కేటగిరీలో వస్తారని వివరించారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు